NLG: చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డ్లో గల మక్కా మసీదుకు స్థానిక మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు యాదవ్ శుక్రవారం ఏసీని బహూకరించారు. ముస్లిం సోదరులు చేసిన విజ్ఞప్తి మేరకు వారు వెంటనే స్పందించి ఈవితరణకు పూనుకున్నారు. కార్యక్రమంలో వనమా వెంకటేశ్వర్లు, నిస్సార్, ఇబ్రహీం, ఫరీద్, సమీర్, జమీల్ అబ్దుల్, జానీ, జావిద్, పాష పాల్గొన్నారు.