ఖమ్మం భూదాన్ భూములను మంత్రులు కబ్జా చేశారని తెలంగాణ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్ ధ్వజమెత్తారు. 1989 వరకు 62.07 ఎకరాలు భూదాన్ పేరుతో ఉండగా, విలువ పెరగడంతో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వందల ఎకరాలు కలిగి ఉండగా, మిగిలిన 32 ఎకరాలను కబ్జా చేశారని విమర్శించారు.