SRCL: మహిళల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని బీజేపీ మండల అధ్యక్షులు విజేందర్ అన్నారు. చందుర్తి మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకంలో అర్హులైన లబ్దిదారులు మండలం లోని గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, తిరుపతి నాయక్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.