NRML: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విజయరామారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో అంజనీదేవి సెలవుపై వెళ్లడంతో, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పని చేసిన అనుభవం ఉండటంతో ఆలయ వ్యవహారాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.