HYD: సికింద్రాబాద్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లతో పాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 11 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.