WGL: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నర్సంపేటకు ప్రత్యేక కేటాయింపులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.