MNCL: లక్షెట్టిపేట పరిధిలోని వివిధ మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు మామిడి, నిమ్మ తోటల రైతులు నష్టపోయారు. సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాలులతో గంటకు పైగా వర్షం నమోదయింది. దీంతో తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఉన్న మామిడి తోటలోని మామిడికాయలు నేల రాలాయి. నిమ్మ తోటలు ఈదురు గాలులకు పడిపవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.