KMM: కూసుమంచి గన్యతండకు చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలోకి గురువారం చేరారు. ముందుగా తండాలోని సేవలాల్ మహారాజ్, మేరమ్మ యాడి నూతన ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ప్రజా ప్రభుత్వమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని వారు విమర్శించారు.