SKLM: అమరావతిని చట్టబద్ధమైన రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ప్రకటనలో తెలిపారు. గత పాలకుల కుట్రల వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వం, ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పంతో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారబోతోందని పేర్కొన్నారు.