BDK: ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. గురువారం అశ్వాపురం మండలం నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. గ్రామ అభివృద్ధిలో మీరు, మేము, మనం అందరం భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీవో, ఎంపీఓ పాల్గొన్నారు.