NZB: ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మాచారెడ్డి రేంజ్ పరిధిలో అడవి ప్రాంతంలో పులి అడుగుజాడలు గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామస్థులు రాత్రి సమయంలో బయటకు వెళ్లకూడదని, పశువులను సురక్షితంగా కాపాడుకోవాలని హెచ్చరించారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.