KMR: ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో లావణ్య (25) అనే వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని తల్లి నరసవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.