SRCL: గ్రామాలలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం బొల్లారం, బాలరాజ్ పల్లి, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు.