ప్రకాశం: ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులోని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్లు, మెటల్ డిటెక్టర్లతో రద్దీగా ఉండే ప్రాంతాలను శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ, ప్లాట్ఫామ్లను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు.