ADB: కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ బీజేపీ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.