SDPT: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘విజయీభవ’ ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవిత గతిని మార్చేది పదో తరగతేనని, మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐప్యాడ్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని ఆయన దీవించారు.