NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల రాంరెడ్డి, మారం మీనారెడ్డి, దూదిపాల సాగర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ లోని తన నివాసంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేయాలని వారికి సూచించారు.