KNR: వెల్గటూర్ మండలం కిషన్రావుపేట శివారులోని అక్రమ తవ్వకాలతో కర్షల్ గుట్ట కరిగిపోతోంది. ఓ రైస్మిల్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో 3 రోజులుగా మట్టి తరలించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 500 ట్రిప్పుల మట్టిని తరలించారని సమాచారం. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.