KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ భూములను అక్రమంగా విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. OPDR భూదాన్ కమిటీ పేరుతో అమాయక ప్రజలకు ప్రభుత్వ భూములను పంచుతామని నమ్మించి, ఒక్కొక్కరి నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.