WGL: ఏనుమాముల మార్కెట్ను ఏఐకేఎఫ్ ప్రతినిధులు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. మార్కెట్లో అన్ని సరుకులకు ఒకే విధంగా ధరలు అమలు చేసి దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు. మిర్చికి క్వింటాకు రూ. 25 వేల కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.