KNR: రామడుగు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో ఉన్నటువంటి యూరియా నిల్వలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాసంగి పంటలకు సరిపడా యూరియా ఉందని సూచించారు.