GDWL: గద్వాల 37వ వార్డులోని అంగన్వాడీ కేంద్రం-2ను కౌన్సిలర్ మంజుల కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా బోధనను పరిశీలించి, గర్భిణులు, బాలింతలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసుకోవాలన్న అవగాహన కల్పించాలని ఆమె కోరారు.