ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికవాడ భూముల గుర్తింపు చుట్టూ రాజకీయం రచ్చ మొదలైంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏరియల్ సర్వే చేపట్టడానికి ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే దొంగతనంగా రావలసిన అవసరం ఏముందని, ఇది వారి మధ్య చీకటి ఒప్పందం అని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శలు గుప్పించారు.