MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన దుబ్బ నవీన్(30), ఎడ్ల యాదగిరి(24) ఆచూకీ ఇంకా లభించకపోవడంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలన్నారు. అలాగే మృతదేహాలు త్వరితగతిన లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.