MBNR: సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యా యులపైనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ మండలం దాచేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఆంజనేయులు గౌడ్ పదవీ విరమణ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.