అన్నమయ్య: కే.వీ.పల్లి మండలంలోని గర్నిమిట్ట PHCలో ఇవాళ్టి నుంచి 23 వరకు పోషణ పక్వాడ ప్రారంభమైంది. తల్లి-శిశు పోషణ, చిన్నారుల మెదడు ప్రారంభ దశ అభివృద్ధి, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు సమాజ పాత్రపై అవగాహన కల్పించారు. స్క్రీన్ టైమ్ తగ్గించి పిల్లలతో సమయం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.