GNTR: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేసింది. స్థానిక బాలాజీ రావు పేటలోని తడికల మిల్లు సమీపంలో ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి గాను స్థానికులు ట్రస్ట్ సభ్యులను అభినందించారు.