అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.