SRD: జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే మొదటి విడత జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిలన చేసి జన గణన సమర్థవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.