W.G: జన గణన-2027లో భాగంగా మొదటిదశ కింద ఇవాళ నుంచి ఇళ్ల లెక్కింపు వాటిలో వసతుల గణన ప్రారంభమైంది. ఈ మేరకు స్థానిక కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విధానంలో చేపట్టిన స్వీయ గణనకు సదుపాయం ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని తెలిపారు.