CTR: చిత్తూరులో మహిళల భద్రత, బాలికల రక్షణే ధ్యేయంగా శక్తి టీం ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ సదస్సులో సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ ఎలా ప్రాణరక్షణగా నిలుస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. మహిళలు తమ రక్షణ కోసం టెక్నాలజీని, పోలీసు వ్యవస్థను ధైర్యంగా వినియోగించుకోవాలన్నారు.