KDP: రానున్న వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా మైదుకూరులోని ఎర్ర చెరువుకు అధికారులు నీటిని విడుదల చేశారు. గతంలో వేసవి కాలంలో నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వద్ద వేచి చూడాల్సి వచ్చేదన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో పలుమార్లు నీటిని సరఫరా చేయడంతో, మున్సిపాలిటీలో ప్రస్తుతం నీటి కొరత లేదని అధికారులు తెలిపారు.