ADB: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష జండా ఊపి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. గెలుపొందిన విజేతలకు మహిళా దినోత్సవ సందర్భంగా బహుమతులు అందజేస్తామన్నారు.