NRPT: మక్తల్ పట్టణంలో 16వ వార్డుకు చెందిన వల్లంపల్లి లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కుటుంబాన్ని పరామర్శించారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.