SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామ ఉన్నత పాఠశాలలో నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సమితి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలో ప్రదర్శన చేపట్టి ప్రజలకు నీటి ప్రాముఖ్యత వివరించారు. అనంతరం నీటిని ఆదా చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సమితి ప్రతినిధులు అన్నమేరి, వట్టి సుజాత పాల్గొన్నారు.