WNP: కుమ్మెరలో జరిగిన దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని వనపర్తి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో నాయకులు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు తిరుమలేశ్ పాల్గొన్నారు.