HNK: 59వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.