MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం కొంతం కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. పేద కుటుంబానికి చెందిన కిష్టమ్మ కుటుంబ సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తమ వంతు సహాయంగా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.