NLG: మిర్యాలగూడ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి మాధవి ప్రారంభించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పట్టణానికి వచ్చే రైతులకు, సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం సుమారు 3,000 మందికి ఈ అన్నదానం నిర్వహిస్తున్నారు.