RR: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. దేశ ప్రధానిని ఉగ్రవాదులతో పోల్చడం దేశద్రోహానికి సమానమని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలు తగిన సమాధానం ఇస్తారన్నారు.