MNCL: బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు అన్నారు. ఆదివారం జన్నారంలో వారు మాట్లాడుతూ.. దేశంలో 55 శాతం పైగా ఉన్న బీసీలు రిజర్వేషన్ల పెంపు కోరుకుంటున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.