RR: కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో మంచినీటి సమస్యలను పరిష్కరించడానికి కొత్త పైపులైన్ పనులను సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీపీ నిధుల నుంచి రూ. 4 లక్షలతో వాటర్ పైపు లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.