MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని పలు మసీదుల్లో గురువారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పండ్లు పంపిణీ చేశారు. గత 21 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు పండ్లు అందజేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. పండ్లు అందుకున్న ముస్లిం సోదరులు లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.