BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భువనగిరి మండల అధ్యక్ష , కార్యదర్శులు రాసాల నిర్మల, కొండమడుగు నాగమణి డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి మండలం బస్వాపురంలో ఐద్వా ఇంటింటి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు.