KMM: మధిర మండలం నాగవరప్పాడు ఎంపీపీఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం జరిపారు. సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు జరిపారు. ప్రధానోపాధ్యాయులు పురం సంగారావు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సీహెచ్వి రవికుమార్, లింగయ్య, వీవీఎన్ రాజు పాల్గొన్నారు.