KMR: గతంలో గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మురళీ ఆదేశించారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ నిధులను గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే పంచాయతీ సెక్రటరీలు చెల్లించాలని సూచించారు.