MDK: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం శివారు ఓ కంపెనీలో ‘Arrive Alive’ కార్యక్రమం నిర్వహించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.