HYD: మహావీర్ జయంతి సందర్భంగా రేపు (మార్చి 31) నగరంలో మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ముఖ్యంగా GHMC పరిధిలోని అన్ని కబేళాలు, మటన్, చికెన్ విక్రయశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా అధికారులు హెచ్చరించారు.