E.G: గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్న ఫిర్యాదులపై భూగర్భ జలాశయ అధికారి రాధాకృష్ణ ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీలో భారీ మోటర్లు బిగించడం వల్ల వ్యవసాయ బావులు ఎండిపోతున్నాయని HITTVలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. రైతు సత్య ప్రకాశ్ రావు పొలంలోని బావిని పరిశీలించి, నీటి నిల్వలపై ఆరా తీశారు.