MDK: చేగుంట మండలంలోని గోపాలపురం గ్రామం నుంచి కొండగట్టు అంజన్న క్షేత్రం వరకు సోమవారం పాదయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ జయంతిలోపు స్వామివారిని దర్శించుకోవాలనే సంకల్పంతో మాజీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం నేతృత్వంలో 16 మంది మాలధారులు ఈ యాత్ర చేపట్టారు. భక్తిశ్రద్ధలతో కొండగట్టు చేరుకుని మొక్కులు తీర్చుకుంటామని వారు తెలిపారు. బయలుదేరిన మాలధారులకు వీడ్కోలు పలికారు.